Wednesday, January 25, 2017

WE, THE PEOPLE OF INDIA



WE, THE PEOPLE OF INDIA, having solemnly
resolved to constitute India into a 
SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC
and to secure to all its citizens:
JUSTICE, social, economic and political;
LIBERTY of thought, expression, belief, faith and worship;
EQUALITY of status and of opportunity;
and to promote among them all FRATERNITY assuring the dignity of the individual
and the unity and integrity of the Nation;
IN OUR CONSTITUENT ASSEMBLY this twenty sixth day of November, 1949, do HEREBY ADOPT,
ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.


భారత రాజ్యాంగ పీఠిక అది! 

ఆత్మ ఇక్కడ ఉన్నది : JUSTICE * LIBERTY * EQUALITY * FRATERNITY 

"భారతదేశ ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుని భారత పౌరులందరికీ :
  • సాంఘిక, ఆర్ధిక, రాజకీయ 'న్యాయాన్ని'; 
  • ఆలోచనలోనూ, భావ ప్రకటనలోనూ, మత విశ్వాసాలలోనూ, ఆరాధన లోనూ 'స్వేచ్చను'; 
  • జీవిత అవకాశాలలో, సామాజిక విషయాలలో, 'సమానత్వాన్ని';
  • వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను సమగ్రతను పెంపొందించుకునే విధంగా 'సౌభ్రాతృత్వాన్ని';
కల్పించి, ఈ రాజ్యాంగ పరిషత్తులో తీర్మానించి, చట్టరూపంలో పరిగ్రహించి మాకు మేము 26 నవంబరు 1949 నాడు సమర్పించుకుంటున్నాము."

*

ఎవరు రాయగలరు ఇంతకంటే మానవీయమైన మహాభారతాన్ని? ఎవరు స్వప్నించగలరు ఇంతకంటే గొప్ప దేశాన్ని!

మీరే. నేనే.

అవును. 24,533 రోజుల క్రితం (67 ఏళ్ళ క్రితం) చేసుకున్న బాసలు అవి. ఆ తర్వాత మరో అరవై రోజులకు ఆచరణకు సిద్దమైన సందర్భం అది. నాడు మీరు ఉన్నారు. నేనూ ఉన్నాను. భారతీయాత్మ ఉంది. అది కాలానికి అతీతం. ఒక్కసారి కళ్ళుమూసుకుని ఆ రోజుకు వెళ్ళండి.  

మళ్ళీ వర్తమానంలోకి రండి. 

ఈ రోజు నుంచి రాబోయే కాలాలకు మన, మన పిల్లల, వారి పిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది. అందులో మన పాత్ర కనిపిస్తుంది - కాలానికి అతీతంగా. 

కర్తవ్యమూ తెలుస్తుంది. 

'ఈ రాజ్యాంగం ఆచరణ సాధ్యం. సంక్షోభంలోనూ, సంతోషంలోనూ ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచే శక్తీ, వెసులుబాటూ దీనికి ఉందని నమ్ముతున్నాను నేను. దురదృష్టవశాత్తు అవాంఛనీయ పరిణామాలు జరిగితే దానికి కారణం రాజ్యాంగం కాదు. మానవతప్పిదాలే' అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్.

నేడు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోకన్నా మిన్నగా ఈ దేశప్రజలకు దక్కాల్సినవి ఏమిటో స్ఫటిక స్పష్టంగా చెప్పింది మన రాజ్యాంగం. రాజకీయ పార్టీలు సహా అన్ని వ్యవస్థలూ ఇందుకు లోబడి పనిచేసే అనివార్యతను కల్పించే విషయంలో రాజీ పడవద్దు. అప్రమత్తంగా ఉందాం. అది మన బాధ్యత. హక్కు కూడా.

గణతంత్ర దిన శుభాకాంక్షలు.  జై హింద్! 

No comments:

Post a Comment